- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ వనం ప్రజల సందర్శనార్థం తెరుచుకోనుంది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు ప్రజల సందర్శనకు అనుమతి ఉంటుందని ఈమేరకు రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. గేట్ నంబర్ 35 ద్వారా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. అమృత్ ఉద్యానవనాన్ని సందర్శించాలనుకునేవారు రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్తో పాటు ఆఫ్లైన్లో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు.
- Advertisement -



