నవతెలంగాణ-హైదరాబాద్: నాగపూర్ వేదికగా ఇండియా-న్యూజిలాండ్ల మధ్య తొలి టీ20 ప్రారంభంకానుంది. ఈక్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఐదు టీ20 సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. నాగపూర్ వేదికగా టీమిండియా-కివీస్ జట్ల తొలిపోరులో బోణీ కొట్టాలని ఉవ్విళ్లురుతున్నాయి.
తుది జట్లు (అంచనా)
భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రింకు సింగ్, శివమ్ దూబె, అర్ష్దీప్ సింగ్, జశ్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్ : టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మాన్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, ఇశ్ సోధి, జాకబ్ డఫ్ఫీ.



