- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు.
కాటారం నూతన ఆర్డీవో గా పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ ను తెలంగాణ రాష్ట్ర ఈజిసి కౌన్సిల్ మెంబర్ దండు రమేష్,కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు,కాటారం సబ్ డివిజన్ లో ఉన్న ఐది మండలాలలో ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఉన్న ప్రధాన భూపట్టాల సమస్య (ధరనిలో జరిగిన అవకతవకలు) మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని వారికి విన్నవించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, కొండగొర్ల రాంనారాయణ , ఆత్మకూరి కుమార్ యాదవ్ పాల్గోన్నారు.
- Advertisement -



