ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే టీజర్ ఇప్పటికే అందరిలోనూ మంచి బజ్ను క్రియేట్ చేసింది. ‘తస్సాదియ్యా’ అనే పాట కూడా యూట్యూబ్ని షేక్ చేసే స్తోంది. మంచి బజ్ను క్రియేట్ చేసిన ఈ సినిమాని జూన్ 19న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘ఓ బేబీ’ తరువాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఆడియెన్స్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్ ప్లేని అందిస్తుండటంతో మరింతగా హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్ని పోషించారు. శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. చిన్నాసకుటుంబ సమేతం గా చూసే చ్రితం, పెద్దా అన్న తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ రాబోతోంది. ఈ చిత్రానికి కెమెరామెన్ : ఓం ప్రకాష్, సంగీతం : సంతోష్ నారాయణన్, ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల.



