నవతెలంగాణ – కోటగిరి : ఎవరి నిర్లక్ష్యం ఎవరికి శాపంగా మారుతుందో తెలియడం లేదు. అలాంటి ఘటన కోటగిరి మండల కేంద్రంలోని విద్యా సముదాయంలో కనిపించడం విడ్డూరంగా ఉంది. మండల కేంద్రంలోని విద్యా సముదాయంలోని నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనానికి అనుకొని ఉన్నటువంటి విద్యుత్ స్తంభానికి ఉన్నటువంటి విద్యుత్ తీగలు అక్కడ వేపుగా పెరిగిన చెట్టు కొమ్మలతో తీగలకు అల్లుకొని పోవడంతో ప్రమాదకరంగా మారింది. మరికొన్ని రోజులను నూతన విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటు వర్షాకాలం కావడంతో విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్టు కనిపిస్తుంది. గతంలో వర్షాల కారణంగా పలుమార్లు మంటలు చిల్లరేగినట్టు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ఇటు విద్యుత్ శాఖ, అటు విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయ్యా సారు…. ఇదేమి తీరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



