- Advertisement -
- ప్రిన్సిపాల్ విజయ లక్ష్మి
నవతెలంగాణ-చందుర్తి: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ లక్ష్మి సూచించారు. శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయో పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే పోటీతత్వంతో చదవాలని చెప్పారు. .సెల్ ఫోన్కు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, పిల్లలపై ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు దృష్టి సారించాలని, దీంతో విద్యార్యుల భవిష్యత్ బాగుంటుందని అన్నారు. కాలేజ్లో ఉన్న డిజిటల్ తరగతి గదులను విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -



