- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్: ఆలేరు పట్టణానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు, కాంగ్రేస్ నాయకులు మోతె కనకమ్మ వెంకటేష్, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మొరిగాడి వెంకటేష్, కొలుపుల హరినాథ్, బింగి రవి, గిరిరాజు వెంకటయ్య, ఎండి ఫయాజ్, చెక్కిల రవీందర్ గౌడ్, పడతాం జాషువా, జూకంటి పెద్ద ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


