నవతెలంగాణ-హైదరాబాద్: గ్రామంలోని 300 వీధి కుక్కలను విషమించి చంపినందుకు ఓ సర్పంచ్, జీపీ కార్యదర్శిపై జగిత్యాల జిల్లాలో శనివారం కేసు నమోదైంది. జిల్లా కేంద్ర పరిధిలోని పెగడపల్లి గ్రామంలో ఈనెల 22న ఆ గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి వీలేజ్లో కుక్కుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, దాదాపు 300 శునకాలకు ఇంజక్షన్ ద్వారా వాటి బాడీలోకి విషమించి చంపేశారని ఓ స్థానికురాలు పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన అధికారులు..ప్రాథమిక రిపోర్టును ఫైల్ చేశారు. సదురు గ్రామ సర్పంచ్ను ఏ1గా, జీపీ కార్యదర్శని ఏ2గా చేర్చారు. వారిపై భారతీయ న్యాయ సహిత((BNS) కింద సెక్షన్ 325-3(5), జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం (PCAA) 11(1)(a)(i) కింద వారి కేసు నమోదు చేశారు.
వీధి కుక్కులను చంపినందుకు సర్పంచ్పై కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



