- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ పార్టీ సీనియర్ నేత, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన నానక్ రాంగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య విషమించడంతో శనివారం (జనవరి 24) తుది శ్వాస విడిచారు. వంగ మధుసూదన్ రెడ్డి మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.
- Advertisement -



