- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇప్పటికే కుదుర్చుకున్న వేతన సవరణ ఒప్పందంలో అంగీకరించిన అంశాలు సహా తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలని కోరుతూ … బ్యాంక్ ఉద్యోగులు ఆఫీసర్ యూనియన్లు దేశవ్యాప్తంగా మంగళవారం సమ్మె చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా గల పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బియు) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. తొమ్మిది ప్రధాన బ్యాంక్ యూనియన్లకు ఈ సంఘం ప్రాతినిధ్యం వహిస్తుంది.
- Advertisement -



