- Advertisement -
కన్వీనర్ డాక్టర్ కె.వెంకటేశ్వర రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టీజీ పీజీఈసెట్ -2026 పరీక్షల్లో భాగంగా 28 నాడు తలపెట్టిన పరీక్షలను జూన్ 1వ తేదీన నిర్వహించనున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ కె.వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా పరీక్షను వాయిదా వేసినట్టు ఆయన చెప్పారు. మిగిలిన పరీక్షలు ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 22న ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- Advertisement -



