Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాస్త్రీయ పంటలపై రైతులకు అవగాహన

శాస్త్రీయ పంటలపై రైతులకు అవగాహన

- Advertisement -

అధిక యూరియా వాడకం ద్వారా నేలసరానికి నష్టం జరుగుతుంది శాస్త్రవేత్త : డా.జి రాజేష్ 
నవతెలంగాణ – దర్పల్లి
99 రోజుల ప్రజపాలనలో భాగంగా భూ సంస్కరణ విధానంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ విధానాలపై రైతు ముంగిట్లో పంటల సాగుపై శాస్త్రవేత్తలతో ఎరువుల వాడకం పై వాటి ద్వారా లాభా నష్టలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా బుధవారం మండలంలోని రామడుగు గ్రామములోని రైతు వేదిక ప్రాంతంలో రైతులు పండించే పంటలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన రుద్రూర్ శాస్త్ర వేత్త డా, జి. రాకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొని రైతులకు పంటలపై పలు సందేహాలపై అవగాహన కల్పించారు.

వ్యవసాయంలో లాభదాయకత పండించేందుకు రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం అవసరమని అన్నారు. యూరియా వినియోగించడం ద్వారా ఖర్చు నియాంత్రించవచ్చని అన్నారు. అధికంగా యూరియా వాడకం వల్ల నేలసారానికి నష్టం కల్గుతుందని, అలాగే పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. కాబట్టి సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడిన వారమవుతామని అన్నారు. కార్యక్రమములో మండల వ్యవసాయ అధికారి జాడి వెంకటేష్, విస్తరణ అధికారి మనోజ్, గ్రామ ఉప సర్పంచ్ లోలం రాజేశ్వర్ గ్రామ రైతు సోదరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -