- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : డప్పు, డోలు వాయిద్యాలతో వన దేవతల వన ప్రవేశం జరుగుతోంది. గద్దెల వద్ద పూజాల అనంతరం వనదేవతల వనప్రవేశం జరగనుంది. చిలుకలగుట్టకు సమ్మక్క తరలివెళ్లనుంది. కన్నెపల్లికి సారలమ్మ తరలివెళ్లనుంది. పూనుగుండ్ల (మహబూబాబాద్)కు పగిడిద్దరాజు, కొండాయి (ఏటూరునాగారం)కి గోవిందరాజు వెళ్లనున్నారు. ఈ నెల 28న వనం వీడి జనంలోకి వనదేవతలు వచ్చారు. ఇవాళ జనాన్ని వీడి వనంలోకి వనదేవతలు ప్రవేశించనున్నారు.
- Advertisement -



