- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర బడ్జెట్పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్కు దిశానిర్దేశం లేదని, ఇందులో అసలు ఏమీ లేదని మండిపడ్డారు. ఇది పూర్తిగా చెత్త బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. బెంగాల్కు ఒక్క పైసా కూడా కేటాయించలేదని ఆరోపించారు. రాష్ట్రం నుంచి భారీగా పన్నులు వసూలు చేసినప్పటికీ, రావాల్సిన బకాయిలను కేంద్రం విడుదల చేయడంలో విఫలమైందన్నారు.
- Advertisement -



