- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే. రాయ్ ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరపాలని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. జనవరి 30న బెంగళూరులో ఐటీ శాఖ సోదాల సమయంలో రాయ్ ఆత్మహత్య చేసుకోవడం దేశ పన్ను పరిపాలనపై మచ్చగా పేర్కొన్నారు. అధికారులు ఉన్నప్పటికీ లోడ్ చేసిన తుపాకీ రాయ్కు ఎలా లభించిందని ప్రశ్నిస్తూ, ఇది తీవ్రమైన ప్రోటోకాల్ వైఫల్యమన్నారు. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నిష్పాక్షిక విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరారు.
- Advertisement -



