- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో వందలాది కాకులు బర్డ్ ఫ్లూతో మరణించినట్లు నిర్ధారణ అయింది. జనవరి 11న నౌగాచియా సబ్డివిజన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు అప్రమత్తమై, ప్రభావిత ప్రాంతంలో శానిటైజేషన్ డ్రైవ్ చేపట్టి, కోళ్ల ఫారాల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. ప్రజలు అనారోగ్యంతో ఉన్న లేదా మరణించిన పక్షులను తాకవద్దని, అనుమానిత మరణాలను వెంటనే అధికారులకు నివేదించాలని సూచనలు జారీ చేశారు.
- Advertisement -



