- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మజ్లిస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. AIMIM జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన 4సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
- Advertisement -


