Thursday, February 5, 2026
E-PAPER
Homeక్రైమ్హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య..

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏపీలోని అమలాపురం ప్రాంతానికి చెందిన సతీష్‌ (31) గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం అతనికి వివాహం జరిగింది. తన సోదరుడితో కలిసి మియాపూర్‌లోని బీకే ఎన్‌క్లేవ్‌లో సతీష్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. సతీష్‌ భార్య ఇటీవల సంక్రాంతికి సొంతూరు వెళ్లారు. ఈ క్రమంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్‌ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పని ఒత్తిడి తట్టుకోలేకే సతీష్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -