- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తురైకేలా పీఎస్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక(15) 9వ తరగతి చదువుతోంది. అయితే గత ఏడాది డిసెంబర్ 27న ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా ఆరుగురు బాలురు ఆమెను అడ్డుకుని సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దీనిని వీడియో రికార్డ్ చేసిన ఆ బాలురు తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం బాలిక తండ్రికి తెలియడంతో ఫిబ్రవరి 3న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆరుగురిని అరెస్ట్ చేశారు.
- Advertisement -



