- Advertisement -
నవతెలంగాణ – చెన్నై: ఆదాయపన్ను శాఖ విధించిన పెనాల్టీపై చెన్నై హైకోర్టును ఆశ్రయించిన టీవీకే అధినేత విజయ్కు చుక్కెదురైంది. విచారించిన హైకోర్టు విజయ్ పిటిషన్ను కొట్టేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ రూ. 1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. దీనిపై 2022లో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. గత నెలలో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇప్పుడు పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
- Advertisement -



