నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్(డీఏ) పెండింగ్ బకాయిలను 25శాతంతో విడుదల చేయాలని సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పులను స్వాగతిస్తున్నామని సీపీఐ(ఎం) స్టేట్ సెక్రటరీ ఎండీ సలీమ్ అన్నారు. “ఇది కార్మికులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారుల హక్కు” అని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి అన్నారు. కేవలం రెండు రోజుల క్రితం కేరళ ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ను(డీఏ) ప్రకటించింది. డిఏ హక్కు కాదని వాదించడానికి మమతా బెనర్జీ కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ హైకోర్టు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ, మమతా బెనర్జీ కోర్టు నిర్ణయాన్ని అంగీకరించలేదు. తాజాగా 25% పెరుగుదల అవసరమని సుప్రీంకోర్టు చెప్పింది, ఆ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించిందన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం (DA) చెల్లింపుపై వివాదం నడుస్తోంది. ఉద్యోగులకు డీఏలు చెల్లించడం తప్పనీసరి ఏమి కాదని మమత సర్కార్ వాయిదా వేస్తు వస్తోంది. టీఎంసీ సర్కార్ నిర్ణయాన్ని ఉద్యోగులు రాష్ట్ర కోర్టులో సవాల్ చేయగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ రాష్ట్ర కోర్టు తీర్పును మమత ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కర్నాల్ ధర్మాసనం ఉద్యోగులకు డీఏ చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుతో దాదాపు 20 లక్షల మంది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు.



