- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. నారాయణపూర్లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభలో సీఎం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు. ‘రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా ఆలోచించి ఓటేయాలి. ప్రజా సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడూ ఆలోచించలేదు’ అని అన్నారు.
- Advertisement -



