- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. డీఎల్ పురానికి చెందిన కొండ్రు నాగలక్ష్మి (35) భర్త అప్పలరాజుతో కలిసి బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి కంటెయినర్ లారీ ఢీకొట్టింది. నాగలక్ష్మి పైనుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అప్పలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



