- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీకాళహస్తి సమీపంలో ప్రయివేటు బస్సు బోల్తా పడటంతో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పెద్దకన్నలి ఎస్టీ కాలనీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు డ్రైవర్పై దాడికి దిగారు.
- Advertisement -



