- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. డోర్లి-పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగులు, సామగ్రిని గుర్తించారు. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, సహకరించవద్దని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
- Advertisement -



