- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : 2047 నాటికి రూ.308లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే టార్గెట్గా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. రూ.55లక్షల తలసరి ఆదాయమే లక్ష్యమని తెలిపారు. ‘సూపర్-6 సహా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అభివృద్ధి కార్యకలాపాలను పున:ప్రారంభించడంపై దృష్టిపెట్టాం. విధానాలు, వ్యయప్రాధాన్యతలలో కీలక సవరణలు చేశాం’ అని ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ వివరించారు.
- Advertisement -



