- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. జూన్ 3 -13 వరకు జరుగనున్న ఈ పరీక్షలకు 42,832 మంది విద్యార్థులు హాజరవనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉ. 9:30 గంటల నుంచి మ.12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు తమ హాల్టికెట్లను వెబ్సైట్ bse.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ తెలిపింది.
- Advertisement -