- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉజ్జయిని మహాకాళ ఆలయ దర్శనం అనంతరం కాన్పూర్ దేహత్, గోండాకు చెందిన నలుగురు యువకులు కారులో తిరిగి వస్తుండగా కోటా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో వారి బ్రెజ్జా కారును వెనుక నుండి ఒక ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రేష్ట్ వాజ్పేయి, ప్రాంజల్ చతుర్వేది, అంకుష్, అన్ష్ ప్రతాప్ అనే నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.
- Advertisement -



