- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో కల్తీ పాలు తాగి స్థానికులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు. లాలాచెరువు ప్రాంతంలో నలుగురు చనిపోయారని, ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
- Advertisement -



