- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో ఎన్నికల సంఘం ‘సర్’(ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) తుది ఓటరు జాబితా విడుదల చేసింది. ఇందులో 4.23 లక్షల మంది ఓట్లు తొలగించారు. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ అర్చనా పట్నాయక్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరిలో 2.7 కోట్ల మంది పురుషులు, 2.8 కోట్ల మహిళలు, 7,617 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -



