- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్తో హైకోర్టు ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు కూడా ఇదే తరహాలో బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -



