- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్పై కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కెఎస్యు) దాడికి యత్నించింది. ఈ దాడిలో ఆమె మెడ, చేతికి స్వల్పగాయాలయ్యాయి. కన్నూర్ రైల్వేస్టేషన్లో బుధవారం ఈ ఘటన జరిగింది. కల్లియాడ్లో అంతర్జాతీయ ఆయుర్వే పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించి తిరిగి వస్తుండగా కన్నూర్ రైల్వే స్టేషన్లో ఆమెపై కెఎస్యు విద్యార్థులు దాడికి యత్నించారు. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను కన్నూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -



