- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ‘కేరళ స్టోరీ-2’ (Kerala Story-2) విడుదలకు కేరళ హైకోర్టు (Kerala High Court) బ్రేక్ వేసింది. ఈ చిత్రంపై స్టే విధిస్తూ ధర్మాసనం ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాలో సామాజిక, మతపరమైన అంశాలకు సంబంధించి తీవ్ర వివాదాస్పద కంటెంట్ ఉందని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా ఈ సినిమా ప్రదర్శనకు అనుమతులు మంజూరు చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.సెన్సార్ బోర్డు తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదని కోర్టు స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చిత్ర యూనిట్కు భారీ షాక్ తగిలినట్లయింది.
- Advertisement -



