- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం అధికార డీఎంకే పార్టీలో చేరనున్నారని సమాచారం. ఈ చేరికతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. పన్నీర్ సెల్వం నిర్ణయం అన్నాడీఎంకే పార్టీకి మరింత బలహీనతను చేకూర్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు.
- Advertisement -



