- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు చేసింది. భారీ పేలుడు సంభవించడంతో టెహ్రాన్ కంపించింది. నగరమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. పేలుడు ప్రాంతానికి సమీపంలో ఇరాన్ పోలీసు హెడ్క్వార్టర్స్, అధికారిక టెలివిజన్ కార్యాలయం ఉన్నాయి. సెంట్రల్ టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. యుద్ధం తొలి రోజు మార్గంలోని అడ్డంకులను తొలగించామని, రెండో రోజు కీలక ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది.
- Advertisement -



