Monday, March 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు

అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తున్నాయి. దీంతో ఫోర్డో, నతాంజ్ , ఎస్ఫహాన్ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. నగరాలు.. నగరాలనే ఖాళీ చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం.

వాస్తవంగా అణు కేంద్రాలపై దాడి చేయకూడదని ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ వార్నింగ్ ఇచ్చింది. కానీ తాజా దాడుల్లో అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కూడా అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దాడుల జరుగుతాయన్న నేపథ్యంలో యురేనియం నిల్వలను అణు కేంద్రాల నుంచి ముందుగానే బదిలీ చేశారని, రేడియేషన్‌కు కారణమయ్యే పదార్థాలు అక్కడ లేవని ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -