- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని 17 గ్రామపంచయతీల పరిధిలో నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచులకు ఐదు రోజులు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వి కమలాకర్ తెలిపారు. ఈనెల 2 నుంచి 7 వరకు కలెక్టరేట్ సమీపంలోని న్యాక్ (NAC )భవనంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులలో పరిపాలన వ్యవహారాలు, గ్రామ అభివృద్ధి, విధులు, బాధ్యతల పై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తరగతులను ఉదయం 9:30 నుంచి 6 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. సర్పంచుల శిక్షణానంతరం త్వరలో మండలంలోని 166 వార్డు సభ్యులకు రెండు విడుదలగా మండల కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
- Advertisement -



