- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మంజీరా ఫేజ్–-3, పెద్దాపూర్ పంప్ హౌస్ లో 35 ఏండ్లకు పైబడిన హెచ్టీ ఎలక్ట్రికల్ ప్యానెల్స్ను తొలగించి, కొత్త ప్యానెల్స్ ఏర్పాటు చేస్తుండడంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వాటర్బోర్డు అధికారులు తెలిపారు. 7న శనివారం ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ఈ కారణంగా శని, ఆదివారాల్లో నీటి సరఫరా ఉండదని తెలిపారు. షేక్పేట్ పరిధిలోని మణికొండ, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని, భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ప్రెషర్తో నీళ్లు వస్తాయని చెప్పారు.
- Advertisement -



