- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్పై అమెరికా అమానుష దాడులకు దిగుతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ నేవీ లక్ష్యంగా దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ డ్రోన్ వాహక నౌక పై దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆ దృశ్యాలను షేర్ చేసింది. ఇరాన్ నేవీ మొత్తాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ముందుకువెళుతున్నామని వెల్లడించింది. తాజాగా ఇరాన్ డ్రోన్ వాహక నౌకను టార్గెట్ చేయడంతో అది మంటల్లో చిక్కుకొని ధ్వంసమయ్యిందని తెలిపింది.
- Advertisement -



