- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమలలో వీకెండ్ సందర్భంగా శనివారం నాడు భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనార్థం 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటలు, టోకెన్లు ఉన్నవారికి 4-6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటలు పడుతుందని టీటీడీ తెలిపింది. నిన్న 66,855 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 26,690 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చింది.
- Advertisement -



