- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో చమురు నౌకలకు తమ దళాలతో రక్షణ కల్పిస్తామని ఇటీవల అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో యూఎస్ బలగాల కోసం వేచి చూస్తున్నట్లు ఐఆర్జీసీ పేర్కొంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1987లో అమెరికన్ సూపర్ట్యాంకర్ అగ్నిప్రమాదం, ఇటీవల లక్ష్యంగా చేసుకున్న చమురు ట్యాంకర్లను గుర్తు చేసుకోవాలని సూచించింది.
- Advertisement -



