- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన చిత్రం ‘ధురంధర్’. గతేడాది చివర్లో విడుదలై సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్గా ‘ధురంధర్: ది రివెంజ్’ రానుంది. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగం హిందీలో మాత్రమే విడుదల కాగా.. రెండో పార్ట్ హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ను విడుదల చేశారు.
- Advertisement -



