- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుడిపల్లి మండలం యామిగానిపల్లె గ్రామంలో ఆదివారం గొర్రెలను చెరువులో కడిగేందుకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు శ్రావణి (15), పునిత (18) ప్రమాదవశాత్తూ అందులో పడి మృతి చెందారు. తండ్రి ఆదేశాల మేరకు గొర్రెలను కడుగుతుండగా, శ్రావణి కాలు జారి చెరువులో పడిపోవడంతో.. ఆమెను కాపాడే ప్రయత్నంలో పునిత కూడా లోతైన గుంతలో పడింది. దీంతో ఇద్దరూ మరణించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
- Advertisement -



