- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాల్లో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఓ భారతీయుడు చనిపోయాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఆ దాడిలో భారత్కు చెందిన వ్యక్తి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. అల్ఖర్జ్లోని నివాస ప్రాంతాల్లో ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఇద్దరు బంగ్లాదేశీయులు చనిపోయారు. ఈ ఘటనలో గాయపడిన 12 మంది ఓ భారతీయుడు ఉన్నాడని పేర్కొంది.
- Advertisement -



