Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదాపూర్ లో విద్యార్థులకు వైద్య పరీక్షలు

మాదాపూర్ లో విద్యార్థులకు వైద్య పరీక్షలు

- Advertisement -

– పాల్గొన్న సర్పంచ్ ఆశా పాటిల్..
నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని మాదాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గ్రామ సర్పంచ్ ఆశా పార్టీ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆశా పాటిల్ సర్పంచ్ పాఠశాలను ఉదయం 9 గంటలకు సందర్శించి  ప్రేయర్  లో పాల్గొనడం జరిగింది . ఇంటర్నేషనల్  ఉమెన్స్ డే సందర్భంగా పాఠశాల పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయించి బ్లడ్ గ్రూపు పర్సెంట్ చెక్ చేయించడం జరిగినది. పిల్లలకు ఉపాధ్యాయులు నేర్పుతున్న విద్యను విద్యార్థులకు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచి ఆశా పాటిల్ , ఉప సర్పంచ్,  డ్వాక్రా గ్రూప్ సంఘ జ్యోతి మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజయ్య సార్ ,  ఉపాధ్యాయులు సంతోష్, గ్రామస్తులు రాజు పటేల్ , అశోక్ పటేల్ , రామచంద్ర పటేల్,  గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగినది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -