- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ దాడులు పెంచుతోంది. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో నలుగురు గాయపడగా, వారిలో ఒకరు భారతీయుడని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో విమానాశ్రయ అధికారులు ప్రయాణికులు, సిబ్బందికి భద్రతా సూచనలు జారీ చేశారు. డ్రోన్ల దాడుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
- Advertisement -



