Wednesday, March 11, 2026
E-PAPER
Homeజాతీయంకేరళ వేదిక‌గా కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోడీ విమ‌ర్శ‌లు

కేరళ వేదిక‌గా కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోడీ విమ‌ర్శ‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేరళ ఎర్నాకుళం వేదిక‌గా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమ‌ర్శ‌లు గుప్పించారు. పశ్చిమాసియా యుద్ధంతో లక్షలాదిమంది భారతీయులు చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. భారతీయులు అక్కడ చిక్కుకోవాలని కాంగ్రెస్‌ కాంక్షిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు మోదీ. దేశ యువతపై రాహుల్‌గాంధీకి ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. కేరళ యువత డ్రోన్లను తయారు చేస్తున్న విషయంపై రాహుల్‌గాంధీకి ఇప్పటికి కూడా అవగాహన లేదన్నారు. భారత అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ యువరాజు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. యుద్ధం పేరుతో తనను తిట్టడమే పనిగా కాంగ్రెస్‌ నేతలు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్దాన్ని కూడా కాంగ్రెస్‌ తన స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు.గల్ఫ్‌ యుద్దం అందరికి మరో గుణపాఠం నేర్పిందన్నారు ప్రధాని మోదీ. ఇంధన రంగంలో ఆత్మనిర్భరతకు కృషి చేస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -