– తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విదేశీ విద్య శిక్షణకు ప్రాథమిక ఉపాధ్యాయులకు మొండి చేయి చూపించి వివాదస్పద జాబితా రూపొందించడంలో అక్రమాలకు పాల్పడిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్పీటీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, ఆర్.రోహిత్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీఆర్టీ ఎంపిక చేసిన జాబితాలో 65 వేల మంది క్యాడర్ ఉన్న ప్రాథమిక ఉపాధ్యాయులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రాథమిక ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు.
అక్రమ అధికారులపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



