- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం దివంగత జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ కొత్త పార్టీని ప్రారంభించారు. పార్టీ పేరును ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవార్ మక్కల్ మునేట్ర కజగం’గా వెల్లడించారు. కొబ్బరి చెట్టును పార్టీ గుర్తుగా ప్రకటించారు. తన అనుచరులతో కలిసి మీడియా ఎదుట వివరాలు వెల్లడించారు.
- Advertisement -



