నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ ఎదుట టీఎంసీ ఎంపీలతో పాటు వివిధ పార్టీల ఎంపీలు ఆందోళన చేపట్టారు. దేశంలో గ్యాస్ కొరత నానాటికి పెరిగిపోతుందని, మోడీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్లోని మకర ద్వారం వద్ద మోడీజీ ఎల్పీజీ అంటూ ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు.
“కొరత లేదని చెప్పడం ద్వారా, అది కొరత కాకుండా ఎలా అవుతుంది?… కేంద్ర మంత్రి పూరి ఇక్కడ ఏమీ తప్పు లేదని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు… సంక్షోభం ఉందని మనం అంగీకరించాలి. అప్పుడు సంక్షోభాన్ని పరిష్కరించడానికి మార్గాలను కనుగొనాలి… నిన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ అదే చేయడానికి ప్రయత్నించారు, కానీ ఆయనను పూర్తి చేయకుండా ఆపారు. మనం గుర్తించి, మార్గాలను కనుగొందాం, కానీ ఈ ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా ఉంది’ అని కాంగ్రెస్ ఎంపీ జెబి మాథర్ మీడియాతో అన్నారు.



